CM కేసీఆర్ ​టైమ్ అయిపోయింది.. మరో ఐదు నెలలే పవర్: మాణిక్ రావు ఠాక్రే

by Disha Web Desk 19 |
CM కేసీఆర్ ​టైమ్ అయిపోయింది.. మరో ఐదు నెలలే పవర్: మాణిక్ రావు ఠాక్రే
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ టైమ్ ​అయిపోయిందని, కేవలం ఐదు నెలలే ఆయన ప్రభుత్వం నడుస్తుందని కాంగ్రెస్ ​పార్టీ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే పేర్కొన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో రాజీవ్​గాంధీ యూత్​క్విజ్​కాంపిటేషన్​పోస్టర్‌ను రిలీజ్​చేశారు. ఈ సందర్భంగా థాక్రే మాట్లాడుతూ.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సర్కార్ తప్పిదాలన్నింటిని బయటకు తీస్తామని పేర్కొన్నారు.

పీసీసీ చీఫ్​రేవంత్ మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లుగా కేసీఆర్ సర్కార్ అరాచకాలను ప్రజలు భరించలేకపోతున్నారన్నారు. రెండు సార్లు అవకాశం ఇచ్చినా.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను ప్రగతిభవన్​నుంచి బయటకు తీసుకువస్తామన్నారు.

ఫిషరీస్​చైర్మన్​మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​హస్తం గుర్తుతో కార్​గుర్తు టైర్లు, అద్దాలు పగిలిపోతాయని విమర్శించారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్​గవర్నమెంట్ అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​సీనియర్ లీడర్​మధుయాష్కీ గౌడ్​తదితరులు పాల్గొన్నారు.

Also Read..

వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై TPCC చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ



Next Story

Most Viewed